ఓట్ల రిగ్గింగు దొంగలు ఒక చోట దొరికి పోయారు ఏపిలో పరిషత్ ఎన్నికలు ఫార్సుగా మారాయి. ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులపై ఫిర్యాదులు వస్తున్నా పొలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోతుండటంతో మరింత రెచ్చిపోతున్నారు.
పై నుంచి కింది స్థాయి వరకూ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ నాయకుల హస్త లాఘవానికి అంతులేకుండా పోయింది. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం వుయ్యందన లో అధికార పార్టీ నాయకులు అధికారులు కలిసి ఏవిధంగా రిగ్గింగ్ చేసుకుంటున్నారో చూడండి..
మొత్తం అన్ని పేపర్లుపై వైస్సార్సీపీ అభ్యర్థికి రిగ్గింగ్ చేసేసారు.. రాష్ట్రం మొత్తం కూడా పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకొని వైస్సార్సీపీ చేస్తుంది ఇదే..అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.