27.7 C
Hyderabad
April 18, 2024 07: 23 AM
Slider కడప

వీఆర్ఏ ల ధర్నా…యాచకునికి వినతి పత్రం…

#kadapa 1

కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో సోమవారం వీఆర్ఏల చలో సబ్ కలెక్టర్ ఆఫీస్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో ర్యాలీ గా తరలి వచ్చి ధర్నా నిర్వహించారు. జీతాలు పెంచాలని వినాదాలు చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసిన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

రెండు గంటలు పాటు ధర్నా చేసినా సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది వినతి పత్రం తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో,గేటు బయట కూర్చొని ఉన్న ఓ యాచకుడుకి వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి చిట్వేల్ రవికుమార్,రాజంపేట పట్టణ కార్యదర్శి నరసింహ వివిధ పార్టీల నేతలు మద్దతుగా పాల్గొన్నారు.

Related posts

సామాజిక మాధ్యమాల్లో చెడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

Satyam NEWS

ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ లో కొనసాగుతున్న చేరికలు

Satyam NEWS

Bomb blast: చిన్నారి మృతి: తృణమూల్ కాంగ్రెస్ నేత అరెస్టు

Bhavani

Leave a Comment