భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్ లో ఉత్తమ ఎన్ఎస్ఎస్ అవార్డు తీసుకొని ఆదివారం ఉదయం నెల్లూరు జిల్లా వేదాయపాలెం గాంధీనగర్ స్వగృహంకు చేరుకున్నా చుక్కల పార్థసారథికి విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తాళాలు తప్పట్లతో పూలమాలలు వేసి శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా స్టేట్ ఎన్ఎస్ఎస్ అవార్డు తీసుకున్న సాత్విక కు మరియు పార్థసారథికి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సన్మానం చేశారు.
నాకు ఈ అవార్డు రావడంలో చాలా ఆనందంగా ఉంది మా యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జి యం సుందరవల్లి, రిజిస్ట్రార్ పి.రామచంద్రా రెడ్డి, మాజీ స్టేట్ ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ లేట్ డా. కె. రమేష్ రెడ్డి, ఎన్ ఎస్ ఎస్ కో-ఆర్డినేటర్ డా. ఉదయ్ శంకర్, ఎన్ ఎస్ ఎస్ సిబ్బంది ఉస్మాన్ అలీ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని చుక్కల పార్థసారథి అన్నాడు.
తాను చదివిన కృష్ణ చైతన్య కళాశాల డైరెక్టర్లు డా. ఆర్ వి. కృష్ణ రెడ్డి, పి. చంద్రశేఖర్ రెడ్డి, డీన్ సుధారాణి, కళాశాల యాజమాన్యం పూర్తి సహకారం అందించారని చెప్పాడు. ఈ సమాజం లో మనకి చెడు మంచి అనే రెండు మార్గాలు ఉన్నాయి ఆలాగే యువత కూడా మంచి మార్గం ఎన్ ఎస్ ఎస్ మరియు ఎన్ సి సి లాంటి ప్రభుత్వ సంస్థలో చేరి దేశానికి సమాజానికి ఉపయోగపడలని కోరుకుంటున్నా అని తెలిపాడు.