తొక్కిసలాటలో మృతి చెందిన రమాదేవి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఉయ్యూరు ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీనివాసరావు పై పోలీసులు కేసు నమోదు చేశారు. అదివారం నాడు గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొక్కిసలాట జరగగా ముగ్గురు ప్రాణాలు కోల్పొయారు. పలువురికి గాయాలయ్యాయి. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు శ్రీనివాస రావుపై కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో మృతురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
previous post