కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రకటించిన లాక్ డౌన్ పరిస్థితి కారణంగా ఉపాధి కోల్పోయిన మెకానిక్ లను వివిసి & వివిఆర్ ట్రస్ట్ యాజమాన్యం ఉదారంగా ఆదుకుంది. ఖమ్మం నగరంలోని టూ వీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టూ వీలర్స్, త్రి వీలర్స్ మెకానిక్ లకు వివిసి & వివిఆర్ ట్రస్ట్ యాజమాన్యం బియ్యం సరఫరా చేసింది.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మెకానిక్ లకు బియం సరఫరా చేశారు. ఒక్కక్కరికి 25 కేజీల రైస్ బ్యాగ్ పంపిణీ చేసినట్లు వంకాలయపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. మొత్తం 300 మందికి వితరణ చేసినట్లు ఆయన చెప్పారు. స్థానిక మమతా రోడ్ లోని బజాజ్ షోరూమ్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో మెట్రో టీవీ ఎండీ కొండవీటి జయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
టూ వీలర్ త్రీవీలర్ మెకానిక్ ల పరిస్థితి గమనించి వారికి రైస్ బ్యాగ్ లు అందచేయడం హర్షణీయమని వివిసి మోటార్ అధినేత వంకాలయపాటి రాజేంద్రప్రసాద్ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ముందుంటారని జయప్రసాద్ తెలిపారు.