“కరోనా మహిళా వారియర్”గా జాతీయ పురస్కారాన్ని అందుకున్న విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారిని విజయనగరం ఇందిరా ప్రియదర్శిని వాకర్స్ క్లబ్ సభ్యులు డీపీఓలో కలిసి పుష్పగుచ్చం అందించి, శుభాకాంక్షలు తెలిపారు.
కోవిడ్ 19 విపత్కర సమయంలో నిత్యం క్షేత్రస్థాయిలోనే ఉండి, ప్రజలకు సేవలందించి, ప్రజలకు అండగా నిలిచారని ఇందిరా ప్రియదర్శిని వాకర్స్ క్లబ్ అద్యక్షురాలు ఘండికోట శాంతి జిల్లా ఎస్పీ సేవలను కొనియాడారు.
ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ కోవిడ్ జాగ్రత్తల పట్ల అప్రమత్తంగా చేస్తూ, అవగాహన కల్పిస్తూ, కోవిడ్ నియంత్రణకు పాటించాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించడం, వలస కార్మికులకు సేవలందించినందుకు గాను జిల్లా ఎస్పీ బి. రాజకుమారికి కోవిడ్ మహిళా వారియర్ గా జాతీయ పురస్కారాన్ని జాతీయ మహిళా కమీషను ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో కేంద్ర అటవీ , సైన్స్ అండ్టె క్నాలజీ మంత్రి ప్రకాష్ జవదేవకర్ చేతుల మీదుగా జిల్లా ఎస్పీ రాజకుమారి అందుకున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఎస్పీ రాజకుమారిని ఇందిరా ప్రియదర్శిని వాకర్స్ క్లబ్ సభ్యులు శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఇందిరా ప్రియదర్శిని వాకర్స్ క్లబ్ అద్యక్షురాలు ఘండికోట శాంతి, సభ్యులు పాకా ప్రమీళా రాణి, నీలాపు దేవి, నిర్మల, సీతాదేవి, రాజాన విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్