కరోనా మాస్క్ పెట్టుకోకుండా వాహనాలు నడుపుతున్నవారిని వనపర్తి పోలీసులు పట్టుకున్నారు.
మొత్తం 43 మంది వాహనదారులను తనిఖీ చేసి చలానా విధించినట్లు టౌన్ ఎస్ఐ మధుసూదన్ తెలిపారు. వనపర్తిలోని తహసీల్దార్ కార్యాలయం దగ్గర వాహనాలు తనిఖీ చేశామని ఆయన తెలిపారు.
నెంబర్ ప్లేట్ సరిగా లేని, మాస్క్ లు పెట్టుకోకుండా వాహనాలు నడుపుతున్న వారికి,లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులకి 29800 రూపాయలు చలానా విధించామని చెప్పారు.
వాహనాల తనిఖీలో ఎస్ఐ మల్లేష్, ప్రొబేషనరి ఎస్ఐ లు వరలక్ష్మి, వైష్ణవి, నాగరాజు, నరేష్, పిసిలు రామకృష్ణ, పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్