28.2 C
Hyderabad
April 20, 2024 14: 21 PM
Slider వరంగల్

తల్లితో సహజీవనం చేసి కూతురిపై కన్నేసి పది మందిని చంపేసి

#Warangal Police

స్థూలంగా వరంగల్‌ జిల్లా గొర్రెకుంట బావిలోని శవాల కథ ఇది. సంచలనం సృష్టించిన వరంగల్‌ గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో 10 మృతదేహాలు కనిపించిన కేసు మొత్తం ఒక సహజీవనం చుట్టూనే తిరిగింది. బిహార్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ (24) ఈ దారుణానికి పాల్పడ్డాడని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌ తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోనె సంచులు తయారు చేసే పరిశ్రమలో మక్సూద్‌, భార్య నిషా పనిచేసేవారు. అక్కడే సంజయ్ కుమార్ ఉండేవాడు. నిషా అక్క కూతురు రఫీకా (31) భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో మక్సూద్ కుటుంబంతోనే ఉండేది. సంజయ్ కి రఫికాకు అక్రమ సంబంధం కలిసింది.

రఫీకా కూతురుపై కన్నేసిన సంజయ్

గీసుకొండ మండలం జాన్‌పాక ప్రాంతంలో రెండు గదుల ఇంటిని కిరాయికి తీసుకుని ఆమెతో సహజీవనం  చేశాడు. రఫీకా కూతురిపై కూడా సంజయ్ కన్నేశాడు. దీనిపై రఫీకా సంజయ్‌ను నిలదీసింది. పలుమార్లు అతడితో గొడవ పడింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తన కుమార్తెతో సన్నిహితంగా ఉండడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో రఫీకాను అడ్డు తొలగించుకోవాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు.

పెళ్లి విషయాన్ని పెద్దలతో చెప్పేందుకు పశ్చిమ బెంగాల్‌ వెళ్దామని రఫీకాను మాత్రమే తీసుకుని సంజీవ్‌ యాదవ్‌ మార్చి 6న విశాఖ వైపు వెళ్లే గరీభ్‌ రథ్‌ రైలు ఎక్కాడు. దారిలో మజ్జిగ ప్యాకెట్లు కొని అందులో నిద్రమాత్రలు కలిపి ఆమె అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో ఆమెను రైల్లోంచి తోసేశాడు.

ఒక మర్డర్ దాచేందుకు పది మర్డర్లు

తిరిగి గీసుకొండ చేరుకున్నాడు. మక్సూద్‌ భార్య నిషా రఫీకా ఏమైందని అడిగింది. ఆమె గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పింది. దీంతో మక్సూద్‌ కుటుంబాన్ని కూడా హతమార్చాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు. రెక్కీ నిర్వహించుకున్నాడు.

ఈ నెల 20వ తేదీన మక్సూద్‌ మొదటి కుమారుడైన షాబాజ్‌ పుట్టిన రోజు అని తెలుసుకుని ఆ రోజే చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం 18వ తేదీన వరంగల్‌ చౌరస్తాలో ఓ మెడికల్‌ షాపులో సుమారు 60 నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు.

తాను ఇక్కడికి వచ్చిన విషయాన్ని బయటకు చెబుతారన్న ఉద్దేశంతో ఈ కుటుంబానికి సంబంధం లేని శ్యాం, శ్రీరాం తయారు చేసుకున్న భోజనంలోనూ నిద్రమాత్రలు కలిపాడు. వారంతా నిద్రలోకి జారుకున్నాక అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య వరకు మత్తులో ఉన్న వారందరినీ గోదాము పక్కనే ఉన్న బావిలో పడేసి ఇంటికెళ్లి పోయాడు.

కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు

ఈ కేసు ఛేదించేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. గోదాం, గొర్రెకుంట ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలు ఈ కేసులో కీలకంగా మారాయి. వాటిని ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేశారు. ఇంట్లోంచి వెళ్లడం దగ్గర నుంచి మళ్లీ చేరుకునే వరకు అందులో నమోదయ్యాయి. దీంతో ఈ రోజు మధ్యాహ్నం నిందితుడిని జాన్‌పాక్‌లోని తన ఇంటిలో అదుపులోకి తీసుకున్నాం అని రవీందర్‌ వెల్లడించారు.

Related posts

బామ్మగారి బ్యాలెట్ పోరాటం

Satyam NEWS

శ్రీశైలం క్షేత్రంలో భారీ అవినీతి

Bhavani

How to Buy XRP in 2023 With PayPal or Credit Card

Bhavani

Leave a Comment