32.2 C
Hyderabad
March 28, 2024 23: 29 PM
Slider వరంగల్

ఇంజుర్డ్:రైలుఫుట్ బోర్డులో ఇరుక్కున్న ప్రయాణికుడు

warangal pendyala rail foot board man injured

రైలు వేగం తగ్గడంతో ప్లాట్‌ఫాంపై దిగేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు ప్రమాదవశాత్తు రైలుఫుట్ బోర్డు కు ప్లాట్ ఫారం గద్దె కు మధ్య ఇరుక్కుపోయిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలోని స్టేషన్ పెండ్యాల వద్ద జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం సికింద్రాబాద్ నుంచి వస్తున్న కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్ రైలు స్టేషన్ పెండ్యాలకు చేరుకుంది.

స్టేషన్‌లో రైలు వేగం తగ్గడంతో రైలు దిగేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించాడు ఈ క్రమంలో ఫుట్ బోర్డు కు ప్లాట్ ఫారం గద్దె కు మధ్య ఇరుక్కుపోవడం తో జరిగిన రాపిడికి ఓ కాలు పూర్తిగా తెగిపోయింది. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ సడన్ బ్రేకులు వేయడంతో మరో కాలు తెగిపోయే ప్రమాదం తప్పింది.

అయితే గంటపాటు వాటి మద్యే ఇరుక్కుని ఉండిపోయిన బాధితుడు నరక యాతన అనుభవించాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అతికష్టం మీద అతడిని రక్షించి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Related posts

న్యూ డైమన్షన్: పాత సచివాలయం నుంచి స్కై వాకర్?

Satyam NEWS

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కొత్త చిత్రం ‘మలైకొట్టై వలిబన్’

Satyam NEWS

పోలీస్:12 మంది అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్

Satyam NEWS

Leave a Comment