పశ్చిమగోదావరి జిల్లాలో గ్రామ, వార్డు సెక్రటేరియట్ ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను జాయింట్ కలెక్టర్( సంక్షేమం) హిమాన్సు శుక్లా ఆకస్మిక తనిఖీ చేశారు.
ఆదివారం ఏలూరులోని సి ఆర్ ఆర్ కాలేజ్, కేకేఆర్ గౌతమ్, సి ఆర్ ఆర్ పబ్లిక్ స్కూల్, చైతన్య కాలేజ్, కస్తూరిబా గర్ల్స్ హైస్కూల్, ఏ ఆర్ డి జి కే స్కూల్, కె పి డి టి హై స్కూల్ ల ను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు.
విద్యార్థులు పరీక్షలు ఏ విధంగా రాస్తున్నారో పరిశీలించారు. స్కూల్లో కళాశాలలో ఏర్పాటుచేసిన ఐ సొల్యూషన్ రూములు, మందులు పి పి కిట్లను జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా పరిశీలించారు.
జిల్లాలో గ్రామ ,వార్డు సెక్రటరీ సెక్రటేరియట్ ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పరీక్షలకు ఉదయం 122 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి.
34 వేల 249 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 25,016 మంది హాజరయ్యారని, 9,233 మంది పరీక్షకు హాజరు కాలేదని అధికారులు తెలిపారు.