ఒక వృద్ధురాలిని మాటల్లో పెట్టి ఆధార్ కార్డు తీసుకురమ్మంటూ చెప్పి ఆమె వెనక్కి తిరగ్గానే మెడలో నల్లపూసల బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యాడు ఒక యువకుడు. ఇది మామూలు దొంగ చేసిన తప్పుడు పని కాదు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఆకుల వారి వీధికి చెందిన వార్డు వాలంటీర్ ఈ చోరీకి పాల్పడ్డాడు. అతగాడు పేరు నరేష్. బాధితురాలైన వృద్ధురాలు ఎం వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. వార్డు వాలంటీర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
previous post