కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని అన్నదమ్ముల చెరువు నుండి కమ్మరి చెరువుకు వెళ్లే ప్రధాన కాలువ కాల్వ పక్కన ఉన్నవారు ఎక్కడికక్కడే కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో కాల్వ నుండి నీటి ప్రవాహం తగ్గి దోమలకు పందులకు నిలయంగా మారింది.
దీంతో రాత్రి వేళలో విషజీవులు కూడా సంచరిస్తున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. గతంలో ఈ కాలువ పునరుద్ధరణ పనుల కొరకు సంబంధిత నీటిపారుదలశాఖ అధికారులు పంచాయతీ అధికారులు సర్వే లు చేసారు కానీ నిర్మాణ పనులు మాత్రం చేపట్టలేదు.
దీంతో ఈ ఏడాది ప్రారంభ దశలోనే వర్షాలు భారీగా కురవడంతో కాలువ నీరు చెరువులోకి వెళ్లకుండా కాలువ కట్ట తెగిపోయి పలు కాలనీలోకి వెళుతున్నాయి. దీంతో పలు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి కబ్జాలు తొలగించి కాల్వ పునరుద్ధరణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
జి.లాలయ్య, సత్యం న్యూస్, జుక్కల్