ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఖొగ్దూర్ గ్రామపంచాయతీ లో అడాణేశ్వర ఫౌండేషన్ చైర్మన్ సతిష్ పవార్ ఆధ్వర్యంలో చల్లటి నీటి శుద్ధి కరణ యంత్రం అందించారు. మొత్తం రు.51000, వెచ్చించి గ్రామస్తులకు ఈ సేవలు అందించడం హర్షణీయమని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బేల యంపిపి గంబీర్ ఠాక్రే,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, సర్పంచ్ సుధాకర్, ఎంపిటిసి మంగేష్, టిఆర్ఎస్ నాయకులు మాస్కే తేజ్రావ్,విపిన్,సంతోష్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
previous post