తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కొత్త తుంగపాడు గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ను రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గడప గడపకి వైస్సార్ కార్యక్రమంలో భాగంగా కొత్త తుంగపాడు వచ్చినపుడు ఇక్కడ నీటి వల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నట్లు గమనించామని తెలిపారు.
అందుకే తాము అధికారంలోకి రాగానే ఆర్.డబ్యు.ఎస్ అధికారులతో మాట్లాడి త్రాగునీటి పరీక్షలు చేయించామని తెలిపారు. నీటిలో సమస్య లేదని తేలడంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాజమండ్రి పేపర్ మిల్ యాజమాన్యాన్ని కోరగా వెంటనే బ్రహ్మాజీ వారి సంస్థ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారని అన్నారు.
అలాగే త్వరలో కిడ్నీ వ్యాధికి సంబంధించి ప్రత్యేక డాక్టర్స్ టీమ్ ను పిలిపించి మెడికల్ క్యాంప్ నిర్వహించి వ్యాధికి సంబంధించి కారణాలు తెలుసుకొని వైద్యం అందించే ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాజమండ్రి పేపర్ మిల్ సిబ్బంది బ్రహ్మాజీ గారి, రాజానగరం మండలం కన్వీనర్ మందారపు వీర్రాజు, అడబాల చినబాబు,కొలపాటి వెంకన్న,వాసంశెట్టి పెదవేంకన్న, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.