ఏ పరిస్థితినైనా ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్ కె ఎస్ బహదూరియా వెల్లడించారు. సరిహద్దుల్లో చైనా దుందుడుకు వైఖరితో ఉన్న నేపథ్యంలో బహదూరియా హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. లడక్ తో సహా అన్ని కీలక ప్రాంతాలకు చేరువలో మోహరించి ఉన్నామని ఆయన తెలిపారు. భారతీయ వాయు సేన వేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు భిన్నమైనవని అందువల్ల వాటిని ఎదుర్కొనడానికి అన్ని వేళలా సంసిద్ధతతో ఉండాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.