కరోనా ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ఎంతో ముందు చూపుతో తెలుగు వారి ప్రాణాలను కాపాడిన హీరో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సంఘీభావం తెలుపుదామనే నినాదానికి కడప జిల్లాలో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
స్థానిక ఎన్నికలు వాయిదా వేసి కొన్ని వేల మంది ఆంధ్రుల ప్రాణాలను కాపాడిన హీరో రమేష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుదాం అంటూ సోషల్ మీడియా ఇచ్చిన పిలుపుకు మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కు సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 28 న జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలనే నిర్ణయం ఎన్నికల కమిషనర్ గనుక తీసుకొని ఉండకపోతే…ఈ పాటికి రాష్ట్రం శవాలగుట్టగా మారిపోయేదని, ఆ పని చేయడం వల్లనే ఈరోజు తన పదవిని కోల్పోయి ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చిందని అంటున్నారు.
రాజకీయాలు పక్కన పెట్టి ఒక తెల్ల పేపర్ మీద Thank You Ramesh Kumar Sir అని వ్రాసి కుటుంబం సమేతంగా మన ఇంటి గుమ్మం దగ్గర నిల్చుని ఆ పేపర్ ను చూపుతూ కృతజ్ఞతలు తెలుపుదాం అంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు పిలుపు నిచ్చారు.
ఈ పిలుపునకు స్పందించి కడప జిల్లా తో పాటు అనేక ప్రాంతాల్లో విశేష స్పందన వచ్చింది. కరోనా కట్టడి కోసం క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్న వైద్య సిబ్బంది, పరిశుద్ధ సిబ్బంది కోసం చప్పట్లు కొట్టారని, దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారని,అది చాలా గొప్ప పని అని ఇది కూడా అలాంటిదే అని వారు రమేష్ కుమార్ కు తమ సంఘీభావం ప్రకటించారు.