కరోనాకు తాము కనిపెట్టిన మందు కరోనిల్ కు లైసెన్సులు పొందడంలో తాము ఎలాంటి పొరబాట్లు చేయలేదని పంతంజలి చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ఆచార్య బాలకృష్ణ తెలిపారు. అన్ని నియమ నిబంధనలు అనుసరించామని ఎక్కడా పొరబాటు జరగకుండా చూసుకున్నామని ఆయన అన్నారు.
కరోనిల్ తయారు చేసినత తర్వాత క్లీనికల్ ట్రయల్స్ నిర్వహించామని, వాటి అధ్యయన రిపోర్టులను సంబంధిత అధికారులకు సమర్పించామని ఆయన అన్నారు. మందులో ఉపయోగించిన మూల పదార్ధాలన్నీ కూడా వివరించి చెప్పామని ఆయన అన్నారు. కరోనిల్ ముందు గురించి మాత్రమే తాము చెప్పదలచుకున్నాం కానీ కరోనిల్ గురించి ఎక్కడా ప్రకటనలు జారీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
తుది అనుమతులు రాకముందే కరోనిల్ పై ప్రకటనలు జారీ చేయడంపై ఆయుష్ మంత్రి శ్రీపాదనాయక్ విమర్శలు చేయడాన్ని దృష్టిలో ఉంచుకుని ఆచార్య బాలకృష్ణ ఈ ప్రకటన చేశారు. కరోనా చికిత్సలో తాము కనిపెట్టిన మందులు కరోనిల్, స్వసరి లు చక్కని ఫలితాలు కనబరిచాయని పతంజలి సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే.