బ్రిటిష్ పరిపాలనలో బానిసలుగా, నిస్సహాయులుగా, జీవిస్తున్న మనకు ఎందరో మహానుభావులు చేసిన స్వాతంత్ర పోరాటాలు, త్యాగాలు బానిస సంకెళ్ళు తెంచాయని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు.
నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన డాక్టర్ చదలవాడ నరసరావుపేట నియోజకవర్గ ప్రజానీకానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలను కేవలం గోడలపైన కాకుండా మన అందరి హృదయాలను నిలుపుకోవాలని ఆయన కోరారు. అదే విధంగా టిడిపి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ లాల్ జాన్ భాషా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
లోక్సభ సభ్యుడిగా,రాజ్యసభ సభ్యుడిగా,పార్టీ ఉపాధ్యక్షుడిగా తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి ప్రజల మన్నలను పొందిన మైనార్టీ వర్గాల ప్రతినిథిగా ఆయన అందరికి ఆదర్శమని అన్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, పార్టీ కోసం, ప్రజలకోసం ఆయన పోరాడే తెగింపు నేటి రాజకీయనాయకులకు ఆదర్శమని డాక్టర్ చదలవాడ అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వేల్పుల సింహాద్రి యాదవ్, కడియాల రమేష్, బండారుపల్లి విశ్వేశ్వరరావు, వల్లెపు నాగేశ్వరరావు,కొల్లి బ్రాహ్మయ్య,శేఖర్ గట్టుపల్లి సత్యనారాయణ, మక్కెన ఆంజనేయులు, లింగయ్య, అబ్బూరి శ్రీను ,పుల్కురి జగ్గయ్య పాల్గొన్నారు.
ఇంకా, చల్లా సుబ్బారావు ,వడ్లమూడి శివరామయ్య, పుట్ట సుబ్బారావు, పిచ్చి రెడ్డి,యాడ్స్ వలి, షరీఫ్, కరిముల్లా, సంజీవ రావు, చెన్నయ్య, బొప్పూడి వెంకాయమ్మ, సైదమ్మ,జరీనా,డా౹౹సేసిల్,డా౹౹పీర్ సాహెబ్, రాయప్ప, బంగారం,లాయర్ ప్రసాద్,పూదోట సునీల్,సైదవాలి,ఖాసీం సాంబయ్య,వెంకట్రావు మరియు తెలుగుదేశం పార్టీ వార్డ్, గ్రామ ప్రెసిడెంట్స్,తెలుగు యువత, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.