16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి ని..జైలు కు పంపించాలని టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగళం పాద యాత్ర చేపట్టి ఇవాళ్టి కి వంద రోజులు పూర్తయిన సందర్భంగా… విజయనగరం లోని కోట జంక్షన్ నుంచీ టీడీపీ పాదయాత్ర చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ మాట్లాడుతూ… మాకు తెల్లవెంట్రుకలు వచ్చేసాయని..నల్ల వెంట్రుకలు వచ్చిన నేతలే పార్టీ ని నడిపిస్తున్నారంటు..లోకేష్ పాదయాత్ర గురించి అశోక్ ప్రస్తావించారు.16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి పరిపాలన లో మనం ఉన్నామని… ప్రజలెవ్వరూ ఆనందంగా లేరన్నారు. ఈ తరుణంలో మన పార్టీ నేత లోకేష్ చేపట్టిన పాదయాత్ర ద్వారా.. ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం మనందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్, ఐవీపీ రాజు..బొద్దుల నరసింగరావు, కంది మురళీ నాయుడు తదితరులు పాల్గొన్నారు