అత్యాచార ఘటనపై బాధితకుటుంబానికి అండగా ఉంటూ దోషులను కఠినంగా శిక్షిస్తామని లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి గ్రామ పరిధిలోని కెసియా నాయక్ తండాలో పదవ తరగతి విద్యార్థినిపై కొందరు వ్యక్తులు అత్యాచారం జరిపి చంపిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బాదేపల్లి ప్రభుత్వాసుపత్రిలో విద్యార్థిని మృతదేహాన్ని చూసి కుటుంబీకులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాచార్య ఘటన బాధాకరమని నిందితులు ఎంతటి వారైనా శిక్షించాలని పోలీస్ శాఖను ఆదేశించారు నిందితులకు త్వరగా శిక్ష పడేలా ప్రభుత్వం తరఫున తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అదేవిధంగా బాధ్యత కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు.
previous post