దళితులకు ఎలాంటి సమస్య వచ్చినా దళిత హక్కుల పోరాట సమితి డివిజన్ అధ్యక్షులు కాదేపురం గంగారాం అన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో దళిత హక్కుల పోరాట సమితి మండల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దళితుల కోసం అనేక సంఘాలు ఉన్నాయని, కానీ ఏ సంఘం కూడా దళితులకు క్షేత్ర స్థాయిలో అన్యాయం జరిగితే ఎవరు కూడా స్పందించక పోవడంతోనే దళిత హక్కుల పోరాట సమితి ఏర్పాటు అయ్యిందన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అయ్యాల సంతోష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కుడుగొల్ల రమేష్, ప్రచార కార్యదర్శి బేగరి సాయిలు, బీఎస్పీ నాయకులు బొగడమీది సాయిలు, కాంగ్రెస్ నాయకులు యాదయ్య, ప్రధాన కార్యదర్శి గైని ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు బేగరి దత్తు, ఎర్రోళ్ల అశోక్, నాయకులు నక్కేవార్ మారుతీ, మీరేవార్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
జీ లాలయ్య, సత్యం న్యూస్ జుక్కల్ నియోజవర్గం