జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం బీజేవైఎం నాయకుల ప్రకటన
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు శెట్టిపల్లి విష్ణు మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గం లో గతం నుండే మండలంలో మూడు 30 పడకల ఆసుపత్రులు ఉన్నాయికానీ అందులో సౌకర్యాలు లేవని చెప్పారు. బిచ్కుంద మండలంలో 2019లోనే ముపై పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఒక్క హాస్పిటల్లో కూడా రెగ్యులర్ డాక్టర్లు గాని మౌలిక సదుపాయాలు లేవు. ఆరోగ్య మంత్రి లోపు రెగ్యులర్ డాక్టర్లను మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇస్తేనే ఇక్కడకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ముందు హామీ ఇచ్చిన తర్వాతే ఆయన ఇక్కడ పర్యటన చేయాలని. లేకపోతే భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఈ పర్యటన అడ్డుకుంటామని విష్ణు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం బిచ్కుంద మండల అధ్యక్షుడు శెట్టిపల్లి విష్ణు బీజేవైఎం జిల్లా కార్యదర్శులు రాజు పటేల్, బీజేవైఎం ఉపాధ్యక్షులు తరుణ్,మోగులుగొండ, జుక్కల్ బిజెపి పార్టీ మండల అధ్యక్షులు శివాజీ పటేల్, జుక్కల్ బిజెపి జనరల్ సెక్రెటరీ పాకలి పవన్, ఓ బి సి మోర్చా బిచ్కుంద మండల అధ్యక్షులు గోపాలచారి, చిన్నదేవడ భూత అధ్యక్షులు హనుమండ్లు, చిన్న దేవుడా ఉపాధ్యక్షులు హటకరి గణపతి, మేకల రమేష్, తదితరులు పాల్గొన్నారు.
జి లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం