27.7 C
Hyderabad
April 24, 2024 10: 36 AM
Slider ముఖ్యంశాలు

మండే ఎండలతో ఇబ్బంది పడుతున్నారా? ఇది శుభవార్తే

#rain

ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలలో నాలుగు రోజుల పాటు అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఎండలు పెరిగిపోతున్న ప్రజలకు ఈ మేరకు కొంత ఉపశమనం కలగనుంది. వాయవ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవ నున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

విశాఖ,ఉభయగోదావరి జిల్లాలు,ఉత్తరాంద్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

కోస్తా,రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Related posts

మానవత్వాన్ని చాటుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే

Satyam NEWS

మూడు నెలల్లో అవినీతి మాయం కావాలి

Satyam NEWS

యుగపురుషుడు…స్వామి రామానంద పరమహంస

Satyam NEWS

Leave a Comment