అధిక వడ్డీల కారణంగా చేనేత కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకర సంఘటన కృష్ణాజిల్లా లో జరిగింది. పెడన టౌన్ లోని 17వ వార్డు కు చెందిన కాశం పద్మనాభం,భార్య నాగ లీలావతి, కొడుకు రాజా నాగేంద్రం ఇంట్లోనే ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పెడన ఎస్ ఐ టీ.మురళి ఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలు కుటుంబ సభ్యుల నుండి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి,మృతదేహలు పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ స్పష్టం చేశారు.
జీవన్ ప్రసాద్ అనే వడ్డీ వ్యాపారి 3 లక్షలకు గాను 4 లక్షల 50 వేల అధిక వడ్డీకి ఒత్తిడి చేసి నోట్లు, అగ్రిమెంట్ నోటరీ చేయించి ఒత్తిడి తీసుకురావడం ఆత్మహత్యకు కారణమని అంటున్నారు. మృతుల కుటుంబ బెదిరింపులకు పాల్పడటంతో చేయడంతో మనస్థాపం చెంది నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యకు ఆ కుటుంబం పాల్పడిందని అనుమానిస్తున్నారు.