విజయనగరం నగరానికి చెందిన యువకులు చిత్ర నిర్మాణంపై ఉన్న ఆసక్తితో రూపొందిస్తున్న “నువ్వు వెళ్ళే ఈ రహదారికి జోహార్” అనే వెబ్ మూవీ పోస్టర్ ను జిల్లా ఎస్పీ రాజకుమారీ ఆవిష్కరించారు.
తన ఛాంబర్ లో యువకులు నిర్మించబోతున్న చిత్ర పోస్టర్ ను ఆమె తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ – విజయనగరంకు చెందిన కొంత మంది ఉత్సాహవంతులైన యువకులు చిత్ర సీమలోకి అడుగు పెట్టాలని, తమ ప్రతిభను నలుగురు మెచ్చే విధంగా సినిమాలను నిర్మించాలనే ఆసక్తితో “నువ్వు వెళ్ళే ఈ రహదారికి జోహార్” అనే వెబ్ మూవీని చిత్రీకరిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ వెబ్ మూవీ సుమారు గంటన్నర నిడివి ఉంటుందన్నారు. ఈ చిత్రం పోస్టర్ ను ఎంతో ఆసక్తికరంగా, అందంగా డిజైన్చే సారని, సినిమాకు కూడా మంచి పేరును పెట్టారని చిత్ర యూనిట్ ను అభినందించి, పోస్టరును ఆవిష్కరించారు.
చిత్ర యూనిట్ దర్శకులు నరసింహ మాట్లాడుతూ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో క్రమ శిక్షణతో ఎంతో శ్రద్ధగా చదువు కున్న వ్యక్తి తన కిష్టమైన ఆర్మీ ఉద్యోగాన్ని ఏ విధంగా సాధించారు. దేశానికి ఏవిధంగా సేవలందించారన్న విషయమై వెబ్ మూవీని నిర్మిస్తున్నామన్నారు.
చిత్రాన్ని విజయనగరం జిల్లాలో అందమైన లొకేషన్స్ లో నెల రోజుల వ్యవధిలో నిర్మించి, రిలీజ్ చేయాలని భావిస్తున్నామన్నారు. ప్రజలంతా ఈ చిత్రాన్ని చూసి, తమను ఆదరించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు నరసింహ, భాను వర్మ రాజు, అఖిల్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.