కాలనీలు, బస్తీలు అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి సంక్షేమ సంఘాల పాత్ర కీలకమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ సోనియా గాంధీ నగర్ ఫేస్1 లో ఆదివారం జరిగిన సంక్షేమ సంఘం ప్రతినిధుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సి సి ఎస్ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోనియా గాంధీ నగర్ అధ్యక్షుడు జోగు శ్రీను (వెల్డింగ్), గౌరవ అధ్యక్షులు తాండ్ర యాదగిరి,ఉపాధ్యక్షులు అల్పుల కృష్ణ యాదవ్, ప్రధాన కార్యదర్శి పుట్ట గోపాలకృష్ణ ఇతర ప్రతినిధులు మహిళలకు, ఎన్నికల నిర్వాహకుడు ఎమ్మెస్ చారి కి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి శాలువాలు కప్పి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ ప్రతినిధులు సోనియా గాంధీ నగర్ ప్రజల అభీష్టం ఆకాంక్షల మేరకు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధి ఎంపల్లి పద్మా రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం రవి కుమార్, చర్ల పల్లి డివిజన్ నాయకులు మల్లేశ్ వంశరాజ్, కర్రె సత్యనారాయణ, కమిటీ ప్రతినిధులు హరినాయక్, తేజేశ్వర్ సిద్ధూ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి