కులవృత్తుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని శాసనసభ్యుడు శానం పూడి సైది రెడ్డి అన్నారు.ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రజక వృత్తిదారులకు మంజూరైన ఉచిత విద్యుత్ మీటర్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ రజక,నాయిబ్రాహ్మణ వృత్తి దారులకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా 250 యూనిట్ల విద్యుత్ ను అందిస్తుందని,ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి విద్యుత్ మీటర్లు మంజూరు అయినాయని తెలిపారు.ఇది నిరంతర ప్రక్రియ అని,అర్హులైన వారందరికీ ఈ పథకం అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి గూడెపు శ్రీనివాస్,విద్యుత్ డి ఈ శ్రీనివాస్,ఎ డి ఈ సక్రు నాయక్,టిఆర్ఎస్ నాయకులు గెల్లి రవి,దోంతగాని శ్రీనివాస్,చిట్యాల అమర్నాథ్ రెడ్డి,బెల్లంకొండ అమర్,రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గూడెపు నాగలింగం,దుగ్గి గురు వర్మ, సైదులు,శంబయ్య,సత్యనారాయణ, బ్రహ్మం,శ్రీను,నరేష్,సతీష్,చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్