40.2 C
Hyderabad
April 19, 2024 18: 10 PM
Slider నల్గొండ

కులవృత్తుల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

#socialwelfare

కులవృత్తుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని శాసనసభ్యుడు శానం పూడి సైది రెడ్డి అన్నారు.ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రజక వృత్తిదారులకు మంజూరైన ఉచిత విద్యుత్ మీటర్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ రజక,నాయిబ్రాహ్మణ వృత్తి దారులకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా 250 యూనిట్ల విద్యుత్ ను అందిస్తుందని,ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి విద్యుత్ మీటర్లు మంజూరు అయినాయని తెలిపారు.ఇది నిరంతర ప్రక్రియ అని,అర్హులైన వారందరికీ ఈ పథకం అందిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి గూడెపు శ్రీనివాస్,విద్యుత్ డి ఈ శ్రీనివాస్,ఎ డి ఈ సక్రు నాయక్,టిఆర్ఎస్ నాయకులు గెల్లి రవి,దోంతగాని శ్రీనివాస్,చిట్యాల అమర్నాథ్ రెడ్డి,బెల్లంకొండ అమర్,రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గూడెపు నాగలింగం,దుగ్గి గురు వర్మ, సైదులు,శంబయ్య,సత్యనారాయణ, బ్రహ్మం,శ్రీను,నరేష్,సతీష్,చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

జగన్ పాలనలో పెరిగింది హత్యలు, దోపిడిలు, అత్యాచారాలు మాత్రమే

Satyam NEWS

కవిత పయనం ఎటువైపు.. పార్లమెంటా.. అసెంబ్లీనా-?

Satyam NEWS

నేను మంత్రిని కరోనా అంటే నాకేం భయం?

Satyam NEWS

Leave a Comment