పలు సంక్షామ పథకాలు ప్రజలకు అందిస్తున్న రాష్ట్రాలకు లాగే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం తాజా బడ్జెట్లో పేదలకు వరాలు కురిపించింది. పేదలకు ఉచిత విద్యుత్నుప్రకటిస్తూ కేవలం మూడునెలల్లో 75 యూనిట్ల వరకు వినియోగించే వారికి మాత్రమే ఈ ఉచితంగా కరెంటు వర్తిస్తుందని వెల్లడించింది. దీనికై బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు.
2020-21సంవత్సర బడ్జెట్ను రెండు లక్షల 55వేల కోట్ల రూపాయల అంచనాలతో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఓవైపు కించిత్ అవకాశం దొరికిన రాష్ట్రంలో పాగా వేయడానికి భాజపా ప్రయత్నిస్తుండగా మమతా మాత్రం తన మార్కు రాజకీయాలతో సామాన్యులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే సంవత్సరం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ కావడం తో కొంచెం జనాదరణ పథకాలపై దీదిద్రుష్టి సారించిందని విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.