మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాకు ఆయన పేరు పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నర్సాపూర్ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఆయన ఈ మేరకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒక లేఖ రాశారు.
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించి ఈ మేరకు ప్రకటన చేయాలని ఆయన కోరారు. అల్లూరి సీతారామరాజు తన నియోజకవర్గం నర్సాపూర్ లో జన్మించారని అందువల్ల జిల్లాకు ఆయన పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని రఘురామకృష్ణంరాజు అన్నారు.
పాదయాత్ర సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ మేరకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.