37.2 C
Hyderabad
March 29, 2024 21: 03 PM
Slider విశాఖపట్నం

జగన్ ప్రభుత్వం.. మైనార్టీ లకు ఏం చేసింది..?

జగన్ ప్రభుత్వం మైనారిటీ లకూ చేసింది ఏమీ లేదని…అంతా శూన్యమేనని…తెలుగు దేశం పార్టీ విజయనగరం మైనారిటీ విభాగం ఆరోపించింది. డిప్యూటీ సీఎం అంజాద్ బాష ,వక్ఫ్ బోర్డు చైర్మన్, అలాగే విశాఖ మర్రిపాలెంకు చెందిన మైనార్టీ కార్పొరేటర్.. సిండికేట్ గా ఏర్పడి..మైనార్టీ భూముల ను అడ్డంగా మెక్కేస్తున్నారని ఆరోపించారు. ఇంతవరకు జగన్ ప్రభుత్వం లో మైనారిటీ లను మోసం చేయడం.. అలాగే వాళ్ళ మా భూములను లాక్కుని… దోపిడీకి పాల్పడటం చూసామని..ఇక చూస్తూ ఊరుకోమని…టీడీపీ మైనారిటీ సెల్… ఆ అక్రమాలను… భూ దందాలను అడ్డుకుంటుదని…హెచ్చరించారు…టీడీపీ మైనారిటీ సెల్ నేతలు. ఈ మేరకు పార్టీ కార్యాలయమై అశోక్ బంగ్లాలో వారు మాట్లాడారు.ముస్లిం ల సమస్యలపై పోరాడతున్న…టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నామన్నారు.

ఈ మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా, రాష్ట్ర మైనారిటీ సెల్ మాజీ ఉపాధ్యక్షులు రషీద్, పార్లమెంట్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ అక్బర్, మైనారిటీ సెల్ నాయకులు షేక్ జానీ, ఎస్.ఎం. సుకూర్, జాఫర్, కిశోర్, షమీమ్ ఖాన్, షేక్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు

Related posts

ఇంకా కొనసాగుతూనే ఉన్న రోడ్డు విస్తరణ వివాదం

Satyam NEWS

సమ్మె నోటీసు ఇచ్చిన ఆటో కార్మిక జేఏసి

Sub Editor 2

సమగ్ర శిక్ష ఉద్యోగుల భిక్షాటన

Satyam NEWS

Leave a Comment