27.7 C
Hyderabad
April 24, 2024 07: 29 AM
Slider ప్రత్యేకం

ప్రతి వాడూ నీతులు చెప్పేవాడే…. రాజా

#posanikrishnamurali

ఒక వైపు బూతులు మాట్లాడుతూనే పక్కన వాళ్లకు బుద్ధులు చెప్పేవారు ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నారు. మరీ ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి అనే నటుడ్ని చూస్తే మాత్రం ఆహా ఎంత బాగా చెబుతున్నాడో అని కొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నా చాలా మంది మాత్రం అతని ప్రవర్తనను ప్రశ్నిస్తున్నారు.

గత మూడు నాలుగు రోజులుగా అందరికీ నీతులు చెబుతున్న పోసాని కృష్ణ మురళి తన వృత్తిపరమైన జీవితంలో ఎలా ఉంటాడనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. పోసాని కృష్ణ మురళి అనే ఈ సినీనటుడు తీసుకునే పారితోషికం పై కూడా చర్చలు జరుగుతున్నాయి.

పోసాని కృష్ణ మురళి ఒక రోజు షూటింగ్ లో పాల్గొనేందుకు లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకూ పారితోషికం తీసుకుంటారని కొందరు నిర్మాతలు చెబుతున్నారు. ఆయనకు ఇవ్వాల్సిన పారితోషికం ముందుగా ఇస్తేనే ఆయన షూటింగ్ స్పాట్ కు వస్తారట.

నటించి వెళ్లిన తర్వాత పారితోషికం ఇస్తామని ఏ నిర్మాత అయినా అంటే ఆయన అంగీకరించరని అంటున్నారు. పైగా ఆయనకు ఇవ్వాల్సిన పారితోషికం అంతా కూడా క్యాష్ రూపంలోనే ఇవ్వాలని కూడా ఆయన వత్తిడి తీసుకువస్తారని చెబుతున్నారు. నెలకు కనీసం 20 నుంచి 25 రోజుల పాటు ఆయనకు షూటింగ్ ఉంటుంది కాబట్టి ఆయన నెలసరి ఆదాయం 30 నుంచి 35 లక్షల వరకూ ఉండవచ్చనని కూడా కొందరు అంచనా వేస్తున్నారు.

నిర్మాతలు ముందుగా డబ్బు చెల్లిస్తేగానీ షూటింగ్ కు రాని పోసాని కృష్ణ మురళి, సినిమా విడుదల అయిన తర్వాత వచ్చిన కలక్షన్లను ప్రభుత్వం నెల రోజుల పాటు ఉంచుకుని ఆ తర్వాత  చెల్లిస్తామనే పాలసీని ఎలా సపోర్టు చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Related posts

మహిళల రక్షణ చట్టాలు, దిశా యాప్ పై అవగాహన కల్పించాలి

Satyam NEWS

జగన్ గురూజీకి విరాళం అందించిన గ్లాండ్ ఫార్మా కంపెనీ

Satyam NEWS

రైతుల ముసుగులో దళిత ఎంపీ నందిగంపై గుండాల దాడి

Satyam NEWS

Leave a Comment