కడప జిల్లా రైల్వే కోడూరు లోని మర్కెట్ వద్ద మహమ్మద్ బీన్ తుగ్లక్ గేటప్ లో రైల్వే కోడూరు పట్టణ వీధుల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పంథా గాని నరసింహ ప్రసాద్ హల్చల్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పిచ్చి పరిపాలన వల్ల ఎప్పుడో 700 సంవత్సరాల క్రితం చనిపోయిన తుగ్లక్ ను అందురు గుర్తు తెచ్చుకుంటున్నరంటు తుగ్లక్ వేష ధారణ తో వీధిలో నరసింహ ప్రసాద్ తిరిగారు.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పంథా గాని నరసింహ ప్రసాద్ స్వర్గీయ తిరుపతి ఎంపీ శివ ప్రసాద్ స్వయానా అల్లుడు. శివ ప్రసాద్ వివిధ వేష ధారణ లతో పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష పార్టీలపై ఛలోక్తులు విసరడం లో దిట్ట. ఇప్పుడు ఆయన అల్లుడు రైల్వే కోడూరులో ఇటీవల నరరత్నాలు రంగు రాళ్లు అంటూ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక నవరత్నాలు వీధుల్లో అమ్ముతూ అందరిని ఆకట్టుకున్నారు. ఇప్పుడు తుగ్లక్ వేష ధారణ లో అందరిని నవ్వించాడు. మామా అల్లుళ్ళ కు ఒక్కటే తేడా మామా పార్లమెంట్ లో వేషాలతో హాల్ చల్ చేస్తే, అల్లుడు తాను పోటీ చేసి ఓడిన రైల్వే కోడూరు లో అధికార పక్ష వైఖరి ని తప్పు పడుతూ వేషాలతో హాల్ చల్ చేస్తు పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు.