35.2 C
Hyderabad
April 20, 2024 15: 26 PM
Slider గుంటూరు

టిడ్కో ఇళ్ల పై జగన్ రెడ్డి ప్రభుత్వం మీనమేషాలు

#chadalawada

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని వసతులతో పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్ల పంపిణీ విషయంలో జగన్ ప్రభుత్వం మీనమేషాలు వేస్తుందని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు.

నరసరావుపేట పట్టణంలో స్థానిక మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ లో జరిగిన ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న డా౹౹చదలవాడ మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో 3.18 లక్షలు, నరసరావుపేట నియోజకవర్గంలో 1504 టిడ్కో గృహాలు నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు.

వాటిని లబ్ధిదారులకు అందకుండా వైసిపి ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. టిడ్కో ఇళ్ల పై వైసీపీ ప్రభుత్వం చేసిన ఏడు వేల కోట్ల రూపాయల రుణాలు ఏమి చేశారో సమాధానం చెప్పాలన్నారు. అర్హులందరికీ గుర్తించి పేదలకు టిడ్కో గృహాలు నిర్మిస్తే లబ్ధిదారులకు అంద చేయకుండా పేదల జీవితాలతో వైసిపి ప్రభుత్వం ఆటలాడుతుoదన్నారు.

పేదలకు కేటాయించిన గృహాలను వెంటనే అందజేయాలని లేనియెడల పేదల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రజా చైతన్య యాత్రలో వనమా పవన్, కొత్తమసు మెహర్, వనమా శివ, మాజేటి వెంకటేష్, గట్టుపల్లి సత్యనారాయణ,కొత్తూరి హనుమంతరావు,కాకుమాను వెంకట్రావు, నాగవరపు ప్రసాద్,అత్తులూరి సుబ్బారావు, మాజేటి పుల్లారావు,కోట ప్రసాద్, పువ్వాడ శ్రీనివాసరావు,దేసు శ్రీనివాస్ రావు,గుంటూరు అప్పారావు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

క్రైస్తవ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం

Satyam NEWS

నెల్లూరు కోర్టు చోరీ కేసులో ఎలాంటి సంబంధం లేదు

Satyam NEWS

స్పెషల్ కేస్: సిబిఐ కోర్టుకు వచ్చిన సిఎం

Satyam NEWS

Leave a Comment