32.7 C
Hyderabad
March 29, 2024 11: 24 AM
Slider ప్రత్యేకం

సీక్రెట్ జీవోలు ఎందుకు? విసుక్కుంటున్న అధికారులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ప్రభుత్వ ఉత్తర్వులను అతి గోప్యంగా దాచి పెడుతున్నది. ఇలా జీవోలను దాచి ఉంచడం, ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం చట్టవిరుద్ధం. అయినా రాష్ట్ర ప్రభుత్వం జీవోలను చాలా కాలంగా అప్ లోడ్ చేయడం లేదు. ఇదే విషయంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు అయింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరుగుతోంది. కోర్టులో విచారణకు సమయం దగ్గర పడటంతో ఇప్పుడు జీవోలను బయట పెడుతున్నారు. దీంతో కొన్ని వివాదాస్పద జీవోలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విశాఖ పట్నంలో ఏపీ ప్రభుత్వానికి చెందిన వంద ఎకరాలకుపైగా అతి విలువైన భూమిని ప్రభుత్వం ఏపీ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్‌కు బదలాయించి తాకట్టు పెట్టేసిన వైనం వెలుగులోకి చూసింది. ఇలా భూమిని బదలాయించిన జీవో బయటకు వచ్చింది. అయితే ఏ ఏ భూమి బదలాయించారో మాత్రం తెలియకుండా జాగ్రత్త పడ్డారు.

విశాఖలో అత్యంత కీలకమైన ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క విశాఖలోనే కాదు రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు చాలా వరకూ తాకట్టులోకి వెళ్లిపోయాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం చాలా కాలంగా జీవోలను బయట పెట్టడం లేదు. ఇందు కోసం ప్రత్యేకంగా ఆదేశాలు కూడా ఇచ్చారు. మాన్యువల్‌గా జీవోలు జారీ చేయడానికి ప్రత్యేక వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. అయితే రాజ్యాంగపరంగా.. జీవోలను సీక్రెట్‌గా ఉంచకూడదు. కానీ ఉంచుతున్నారు. కోర్టుల్లో పిటిషన్లు విచారణకు వచ్చినప్పుడు ఒకటి.. రెండు మాత్రం గెజిట్‌లో పెడుతున్నారు. జీవోలు బయటకు వస్తే.. అవి చట్ట విరుద్ధమని ఎవరైనాకోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇస్తుంది. అందుకే సీక్రెట్‌గా ఉంచుతారు. ఇప్పటికీ తాము పారదర్శక పాలన చేస్తున్నామంటారు. కానీ ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయం ఒక్కటీ బయటకు రాలేదు. అర్థరాత్రి జీవోలు జారీ అవుతాయి. రాష్ట్రాన్నిపరిపాలిస్తున్నారో.. సొంత వ్యవస్థను నడుపుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉందని ఉన్నతాధికారులే విసుక్కునే పరిస్థితి ఉంది.

Related posts

హైదరాబాద్ పాతబస్తీలో ప్రియురాలిని చంపిన ప్రియుడు

Satyam NEWS

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు

Satyam NEWS

తెలంగాణ దీర వనిత చాకలి ఐలమ్మ: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

Satyam NEWS

Leave a Comment