డబల్ బెడ్రూమ్ ఇల్లు, దళితులకు మూడు ఎకరాలు భూమి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, రైతులను అడుగడుగునా మోసం చేస్తున్నారని, అటువంటి బి ఆర్ ఎస్ పార్టీకి తగిన గుణపాఠం మునుగోడు తోనే ప్రారంభించాలని హుజురాబాద్ శాసన సభ్యులు ఈటల రాజేందర్, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ లు పిలుపునిచ్చారు.
సోమవారం మునుగోడు నియోజకవర్గం కమ్మ గూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలని కోరుతూ హుజురాబాద్ శాసన సభ్యులు ఈటల రాజేందర్, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, హబ్సిగూడ డివిజన్ అధ్యక్షులు కక్కిరేణి హరీష్, కమ్మ గూడెం గ్రామ సర్పంచ్ ప్రసాద్ ల ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెరాస పార్టీకి తగిన గుణపాఠం మునుగోడు తోనే ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హబ్సిగూడ డివిజన్ సీనియర్ నాయకులు సంజయ్ పటేల్ సుమన్ రావు, హేమంత్ మూలే, శివ గౌడ్, కమ్మ గూడెం గ్రామం వార్డు మెంబర్లు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి