శ్రీశైలం అడవుల్లో మంటలు అంటుకున్నాయి. శ్రీశైలంలోని భీముని కొలను అడవి ప్రాంతంలో ఈ మంటలు ఎగసిపడుతున్నాయి. పెద్ద త్తున చెలరేగుతున్న మంటలను చూసి భక్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. భీముని కొలను బీముణికొలను అడవి మీదుగా పాదయాత్రతో నడిచి వచ్చే మల్లన్న భక్తులకు తగులబడుతున్న మంటల ను చూసి ఒక్క సారిగా భయాందోళనలకు గురయ్యారు.
అలా శివస్వాములు ఫొటోలు తీసి పంపడంతో ఈ వార్త బయటకు వచ్చింది. ఆ ప్రాంతంలో శివస్వాములు పెద్ద ఎత్తున సంచరిస్తుంటారు. ఇటీవల ఆమ్రాబాద్ అడవులు ఇదే విధంగా తగులబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు శ్రీశైలం అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతం దట్టంగా ఉంటుంది. అక్కడ ఇలాంటి సంఘటనలు జరిగితే పరిణామాలు విపరీతంగా ఉంటాయి.