37.2 C
Hyderabad
March 28, 2024 21: 12 PM
Slider ప్రత్యేకం

పనబాక లక్ష్మి గెలిస్తే పెద్దిరెడ్డి రాజీనామా చేస్తారా ?

#NBSudhakarreddy14 (2)

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో  టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మి గెలిస్తే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్దమేనా అంటూ  టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి సవాలు విసిరారు.

మొదట ఐదు లక్షల మెజారిటీ సాధిస్తామని ప్రగల్పాలు పలికిన మంత్రి ఇప్పుడు ఓటమి భయంతో టిడిపిపై బురద చల్లి, నాయకులను భయపెట్టి  లాభపడాలని చూస్తున్నారని విమర్శించారు

తిరుపతి ఓటర్లలో వచ్చిన  అనూహ్య మార్పు వల్ల టీడీపీకి విజయావకాసాలు మెరుగయ్యాయని  చెప్పారు. పార్టీ అధినేత చంరబాబు నాయుడు, లోకేష్ విస్తృత పర్యటనలు  ప్రజలను ఆకట్టుకున్నాయని తెలిపారు.

ఫ్యానుకి ఎదురుగాలి  వీస్తున్నందుననే, మెజార్టీలపై పందాలు కాసిన వారు, ఇప్పుడు గెలుపు ఓటములపై పందాలు కాస్తున్నారని చెప్పారు.

వైకాపా సభలకు జనం రాకపోవడం, పార్టీ నేతల వర్గపోరు చూసి వైకాపాలో అయోమయం నెలకొన్నదని చెప్పారు.

ఓటమి భయం వల్ల, బాబాయ్ విషయంలో ప్రమాణం చేయాలన్న లోకేష్ సవాలు స్వీకరించే సత్తాలేక జగన్ తిరుపతి ప్రచారని రాలేదని స్పష్టం చేసారు.

తిరుపతి సభలో చంద్రబాబుపై రాళ్ల దాడి చేసి భయ పెట్టాలని చూశారన్నారు. అలాగే అచ్చన్నాయుడు పై ఫేక్ వీడియో సృష్టించి శునకానందం పొందుతున్నారని ఎద్దేవా చేసారు.

ఇలాంటి చౌకబారు ప్రయత్నాలు మాని ఎన్నికల ఇంచార్జీగా వున్న రామచంద్రా రెడ్డి ఓటమి చెందితే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తానని ప్రకటించాలని సుధాకర్ రెడ్డి సవాలు విసిరారు.

Related posts

అంబర్పేట్ డివిజన్ లో దారుణం: జిహెచ్ఎంసి ఉద్యోగిపై దాడి

Satyam NEWS

వైస్సార్సీపీ ని విడిచి  టీడీపీ లో చేరిన గిరిజనులు

Satyam NEWS

తెలుగు సినీ పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది

Bhavani

Leave a Comment