జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్.సి.ఈ.ఆర్.టి) విద్యా కేంద్రాల్లో పనిచేసే ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులకు యూజీసీని అమలు చేస్తారా అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం లోక్ సభలో ప్రశ్నించారు. ఒకవేళ అలా చేయకపోతే అందుకు కారణాలు ఏమిటి అని కూడా అడిగారు. దీనికి కేంద్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ సుభాష్ సర్కార్ రాతపూర్వకంగా సమాధానం చెబుతూ ఈ పోస్టులు పూర్తిగా సాంకేతికపరంగా పరిగణించబడతాయని తెలిపారు. అందువల్ల (ఏ.సి.పి) అస్యూర్డ్ కెరీర్ ప్రోగ్రెషన్ పథకం వారికి వర్తించదని తెలిపారు. అయితే ఇతర అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ అనుబంధ సిబ్బందితో సమానంగా కేంద్ర ప్రభుత్వం ఏ.సి.పి. పథకం ప్రయోజనాలు విస్తరించాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందని పేర్కొన్నారు.
previous post