సరూర్నగర్ బీజేపీ అభ్యర్థి ఆకుల శ్రీవాణిని గెలిపించినందుకు కార్యకర్తలకు, ఓటర్లకు, డివిజన్ ప్రజలకు ఆమె విజయం కోసం శ్రమ పడిన ప్రతీ ఒక్కరికి డివిజన్ సీనియర్ నాయకులు పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు బాణాల ప్రవీణ్ మాట్లాడుతూ.. అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, జిల్ల నాయకులు కాటం రాజు, జైన్ బాబు, డివిజన్ మాజీ అధక్షులు గోవర్ధన్, మంచినీళ్ల జంగయ్య, అధ్యక్షులు సిద్దు ముదిరాజ్, గోపి కృష్ణ, దళిత మోర్చా అధ్యక్షులు ఎర్నన్నా, జిల్లా మైనార్టీ మోర్చ ప్రధాన కార్యదర్శి కలీల్, మైనార్టీ డివిజన్ నాయకులు గౌస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే మా లక్ష్యం.. బాణాల ప్రవీణ్
ఈ సందర్భంగా బాణాల ప్రవీణ్ మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థిని గెలిపించడం అంటే సరూర్నగర్ డివిజన్లో అభివ్రుద్ధికి బాటలు వేసుకోవడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రజాసంక్షేమమే కోరుకుంటోందని ఈ దిశలో బీజేపీ పరిపాలన కొనసాగుతోందన్నారు. కానీ రాష్ర్ట ప్రభుత్వం మాత్రం అన్నీ అవాస్తవాలను ప్రచారం చేస్తూ కేంద్రం ఒక్కరూపాయి కూడా ఇవ్వడం లేదని కల్లబొల్లి మాటలు చెప్పి ప్రచారం నిర్వహించినా ఎవ్వరూ నమ్మలేదన్నారు. రాష్ర్ట ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ సంక్షేమ పథకంలో కేంద్రం వాటా ఉందని బాణాల ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. బీజేపీ కార్పొరేటర్ ఆధ్వర్యంలోసరూర్నగర్ డివిజన్ను పూర్తిస్థాయిలో అభివ్రుద్ధిలో తీసుకువెళతామని బాణాల పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించినందుకు మరోమారు ఆయన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.