36 C
Hyderabad
May 13, 2025 11: 23 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

నవంబర్ 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Indian_Parliament

పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చేనెల​ 18 నుంచి ప్రారంభం కానుకన్నాయి. రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ నేతృత్వంలో జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్​ కమిటీ(సీసీపీఏ) సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. నవంబర్​ 18న నుంచి డిసెంబర్​ 13 వరకు సమావేశాలు సాగనున్నట్లు తెలిసింది. అధికారికంగా షెడ్యూల్​ వెల్లడికానప్పటికీ దాదాపు ఇవే తేదీలు ఖరారయ్యే అవకాశముంది. గత ఏడాది పార్లమెంట్​ శీతాకాలం సమావేశాలు డిసెంబర్​ 11న ప్రారంభమై 2019 జనవరి 8 వరకు కొనసాగాయి. ఈ ఏడాదిలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తి కాలం జరిగిన పార్లమెంటు సమావేశాలు అవే. సభ జరగనున్న కాలం, సెషన్​ సిట్టింగ్​లపై వచ్చే వారం జరగనున్న కేబినెట్​ భేటీ అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారు. అదే సమయంలో పార్లమెంట్​ ఉభయసభల్లో చర్చించాల్సిన అంశాలపై కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ సమావేశాల్లో రెండు కీలక అత్యవసరాదేశాలను చట్టంగా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ముఖ్యంగా మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఎదుర్కొనేందుకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్​ ‘దేశీయ కంపెనీలకు కార్పొరేట్​ పన్ను తగ్గింపు’ను చట్టంగా మార్చాలని భావిస్తోంది. ఎలక్ట్రానిక్​ సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకం, దిగుమతి నిషేధంపై జారీ చేసిన ఆర్డినెన్స్​నూ చట్టంగా రూపొందించే అవకాశముంది. మరిన్ని కీలక బిల్లులను ఈ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

Related posts

నెల్లూరు బారాషహీద్ దర్గా అభివృద్దికి రూ. 5 కోట్లు మంజూరు

Satyam NEWS

రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్

Satyam NEWS

టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్ర‌వేశానికి ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!