ప్రతి మనిషిలో కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని జిల్లా జడ్జి డా.టి. శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కోర్టు లో ‘మెనీ హాండ్స్ మేక్ లైట్ వర్క్‘ పేరుతో రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. ఏదైనా ఒక పనిని ఒక్కరు చేసేకంటే ఎక్కువ మంది కలిసి చేస్తే సులభంగా పూర్తి అవుతుందన్నారు. అదేవిధంగా చేసే పనిలో కృషి, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఉండదని, వాటికి అలుపెరగని శ్రమ కూడా తోడైతే అనుకున్నది సాధించవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తాము అనుకున్న లక్ష్యాలను సాధించడానికి తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జావేద్ పాషా, ఆశాలత, సాంతిసోనీ, మౌనిక, శంతిలత, న్యాయవాది ఇమ్మడి లక్ష్మీనారాయణ, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
previous post
next post