28.7 C
Hyderabad
April 25, 2024 06: 05 AM
Slider ఖమ్మం

కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు

#judge

ప్రతి మనిషిలో కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని జిల్లా జడ్జి డా.టి. శ్రీనివాసరావు అన్నారు.  జిల్లా కోర్టు లో మెనీ హాండ్స్ మేక్ లైట్ వర్క్పేరుతో రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. ఏదైనా ఒక పనిని ఒక్కరు చేసేకంటే ఎక్కువ మంది కలిసి చేస్తే సులభంగా పూర్తి అవుతుందన్నారు. అదేవిధంగా చేసే పనిలో కృషి, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఉండదని, వాటికి అలుపెరగని శ్రమ కూడా తోడైతే అనుకున్నది సాధించవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తాము అనుకున్న లక్ష్యాలను సాధించడానికి తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జావేద్ పాషా, ఆశాలత, సాంతిసోనీ, మౌనిక, శంతిలత, న్యాయవాది ఇమ్మడి లక్ష్మీనారాయణ, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హుజుర్ నగర్ నియోజకవర్గ బాధ్యుల నియామకం

Satyam NEWS

అబద్దపు వాగ్దానాలతో అధికారంలో వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

హిడ్మా చనిపోలేదు.. లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

Satyam NEWS

Leave a Comment