శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస గ్రామంలో నిరుపయోగంగా ఉన్న రామయ్య కోనేరు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా తీర్చి దిద్దుతున్నారు.
కోనేరు గట్టు చుట్టూ కొబ్బరి మొక్కలను నాటి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రతినిధి గంగు వెంకటరమణమూర్తి బాణాల గాంధీ పల్లి వైకుంఠ రావు కొయ్యాన జగదీష్ అప్పారావు, ఫీల్డ్ అసిస్టెంట్ ఆదినారాయణ ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
ఈ విధంగా కొబ్బరి మొక్కలు నాటి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా మారడమే కాకుండా స్థానికులకు ఉపయోగపడుతుంది.