గోదావరి నదిలో దూకి ఓ యువతి ఆదివారం నాడు ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆత్మహత్యాయత్నం చేసిన యువతిని రివర్ పోలీసులు కాపాడారు.
గోదావరి నదిలో యువతి దూకిన విషయాన్ని గుర్తించిన రివర్ పోలీసులు వెంటనే గోదావరి నదిలో స్పీడ్ బోటు సహాయంతో యువతిని రక్షించారు.
యువతిని గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో యువతికి చికిత్స అందిస్తున్నారు. యువతి నుండి పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.
8 ఎన్క్లేవ్కు చెందిన పున్నం మిధునా(33) కుటుంబ కలహాల కారణంగా గోదావరి నదిలోకి దూకింది.
కాగా పెట్రోలింగ్లో ఉన్న జే.శ్రీనివాస్, అక్వా టూరిజం సభ్యులు గౌలిగూడ ప్రసన్న కుమార్, గందం వెంకటేశ్ బోటు సహాయంతో నీటిలో మునిగిపోతున్న మహిళను రక్షించారు.
యువతి కుటుంబ సభ్యుల సమాచారం తెలుసుకొని వారికి సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.