తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన మహిళ కమిషన్ లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి కి చెందిన కుముర ఈశ్వరిబాయి సభ్యురాలిగా నియామకం అయిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా బుధవారం ఆదిలాబాద్ లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా తెరాస మహిళ నాయకులు సర్ఫే సొంబాయి, సునీత రెడ్డి పాల్గొన్నారు.