విజయవాడ లో దారుణం జరిగింది. భర్త సంవత్సరం క్రితం కోవిడ్ తో మృతి చెందడంతో అత్త ఇంటి వేధింపులు పెరిగిపోవడంతో ఏం చేయాలో తెలియని ఒక ఇల్లాలు ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నది. హృదయవిదారకమైన ఈ సంఘటన విజయవాడ ప్రసాదంపాడులో జరిగింది. కోవిడ్ తో భర్త మరణించిన ఇద్దరు పిల్లల తల్లి, తమ ఇంటి కోడలు అయిన ఆ ఇల్లాలికి తోడుగా ఉండాల్సిన భర్తింటి కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారు. ఎంత కాలం వేచి చూసినా అత్తింటి వారి వైఖరి మారకపోవడంతో పిల్లలు తో సహ సూసైడ్ చేరుకున్నది ఆ నిస్సహాయ కోడలు. పటమట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
previous post