40.2 C
Hyderabad
April 19, 2024 16: 27 PM
Slider నల్గొండ

సమస్యలు పరిష్కరించి మహిళల అభిమానాన్ని సంపాదించాలి

#Hujurnagar Women

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీలకతీతంగా పరిష్కరించి టిఆర్ఎస్ పార్టీ పరంగా వారిలో అభిమానాన్ని సంపాదించుకోవాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టౌన్ టిఆర్ ఎస్ పార్టీ మహిళా కమిటీ నిర్ణయించింది. హుజూర్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి  ఆదేశాల మేరకు హుజూర్ నగర్ టిఆర్ఎస్ కార్యాలయంలో పట్టణ మహిళా కమిటీ ఎన్నికైన సభ్యుల అభినందన కార్యక్రమం నేడు జరిగింది.

చీకూరి లీలావతి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్,ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చేపట్టిన కార్యక్రమాలు మహిళా సోదరీమణులకు తెలియజేయాలని కోరారు. పార్టీని బలోపేతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో పట్టణ మహిళలు అందరినీ భాగస్వాములుగా చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, ప్రధానకార్యదర్శి  బెల్లంకొండ అమర్, టౌన్  అధ్యక్షురాలు వీసం రత్నశ్రీ, ఉపాధ్యక్షురాలు నాగమణి, ఉపాధ్యక్షురాలు పెద్ది పుష్ప, ప్రధాన కార్యదర్శి గూడెపు దీప, కార్యదర్శి శీలం శెట్టి నాగమణి,ఉప్పల విజయలక్ష్మి, కోశాధికారి, సభ్యులు మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీజేపీకి కౌంటర్ సిద్ధం చేసుకుంటున్న కేసీఆర్

Satyam NEWS

హరీష్, హుజూరాబాద్ సరే పరిగిని అభివృద్ధి చేశారా?

Satyam NEWS

వైభవంగా వైమానిక దళ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment