ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఒక వివాహిత శవమై కనిపించింది. సూర్యాపేట పట్టణంలోని మినీ ట్యాoక్ బండ్ లో ఒక మహిళ మృతదేహం లభ్యం కావడంతో ఈ విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలిని పాపట్ల పద్మ గా సూర్యాపేట రూరల్ పోలీసులు గుర్తించారు.
గత రెండు రోజులుగా తమ కుమార్తె కనిపించడంలేదని ఆమె తల్లిదండ్రులు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అందరూ వెతుకుతుండగా ఆమె మృత దేహం లభ్యం అయింది. భర్త యుగంధర్ రెడ్డి, అత్త కలిసి చంపారని మృతురాలి సోదరుడు గోపిరెడ్డి ఆరోపిస్తున్నారు.