ప్రకాశం జిల్లా సంతనూతలపాడు లో మోటార్ సైకిల్ పై నుండి పడి యువతి మృతి చెందింది. సంతనూతలపాడు శాంతినగర్ కాలనీకి చెందిన చాట్లగడ్డ సుమ (20) తను భర్త మోష ఇరువురు కలసి తన నివాసం నుండి ఒంగోలు కు హాస్పిటల్ కు నిమిత్తం బయలుదేరారు.
ఎస్ ఎస్ ఎన్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద కు చేరుకునే సమయానికి మృతురాలు సుమ తన చున్ని బండి చక్రం లో చుట్టుకుని ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. మృతురాలు సుమ సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. మృతురాలు సుమ తొమ్మిది నెలల గర్భవతి.
సుమ మృతి పట్ల బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు. మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. సంతనూతలపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.