ప్రజా కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తిసుకుంటున్న కేంద్ర ప్రభుత్వనికి మహిళ కార్మిక శక్తిని చూపిస్తామని INTUC నియెజకవర్గ మహిళల అద్యక్షురాలు చప్పిడి సావిత్రి కేంద్ర ప్రభుత్వన్ని హెచ్చరించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల పరిధిలోని మాదవరాయినిగూడెంలో జరిగిన మహిళ కార్మిక సంఘాల సమావేశంలో సావిత్రి మాట్లాడుతూ జాతీయ కార్మిక సంఘాల నాయకుల పిలుపు మేరకు ఈనెల 26న, దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను మహిళ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ అపాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో INTUC మండల అద్యక్షురాలు గడ్డం వేంకటమ్మ, త్రివేణి, విజయ, శైలేజ, తదితరులు పాల్గొన్నారు.