మహిళా సాధికారత, మహిళల రక్షణకై తీసుకుంటున్న చర్యల గురించి ఈ రోజు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్లమెంటరీ కమిటీ చైర్ పర్శన్ హీన విజయ కుమారి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్శన్ వాకిటి సునీత లక్ష్మ రెడ్డి, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి కమిషనర్ దివ్య దేవరాజన్ తో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరి బాయి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కరోన కాలంలో గృహ హింస కేసులు అధికంగా నమోదైన తరుణంలో వాటిని గూర్చి పని ప్రదేశంలో మహిళాలపై జరుగుతున్న లైంగిక దాడులు, జాతీయ మహిళ కమిషన్ కు రాష్ట్ర మహిళ కమిషన్ కు గల పరస్పర సంబంధాల గురించి టోల్ ఫ్రీ నంబర్ల పని తీరు మహిళాలపై నేడు జరుగుతున్న లైంగిక దాడులు,వారి రక్షణకై రాష్ట్ర మహిళా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి సఖి కేంద్రాల పని తీరు,షి టీమ్స్ పని తీరు తదితర అంశాల గురించి చర్చించారు.